WorldWonders

విద్యార్థులకు జ్ఞాపకశక్తి ఇంజెక్షన్లు ఇచ్చిన టీచరు

Delhi Teacher Injects Students With Memory Power Injection

జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులకు ఓ ట్యూటర్‌ ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని మందవాలీకి చెందిన బీఏ చదువుతున్న విద్యార్థి సందీప్‌ (20) 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ట్యూషన్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, అతడు జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొంటూ తన వద్దకు ట్యూషన్‌కి వచ్చే విద్యార్థులకు సెలైన్‌ బాటిల్‌లోని ద్రావణాన్ని ఇంజక్షన్‌గా ఇస్తున్నాడు. ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సందీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. అయితే, యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశానని.. సెలైన్‌ ద్రావణంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలుసుకొని విద్యార్థులకు ఇస్తున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. సందీప్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.