Movies

మందాకినీ నందిని

మందాకినీ నందిని

ఐశ్వర్యరాయ్‌ రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది. అందులోనూ ఒక పాత్ర నాయికైతే రెండోది విలన్‌ పాత్ర. అందాలు నిండిన ఐశ్వర్య నీలి కళ్లల్లో కర్కశత్వం కూడా పలికించనున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఐశ్వర్యరాయ్‌ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ చిత్రంలో ఐశ్యర్య మందాకినీ దేవి, నందిని అనే రెండు పాత్రల్లో కనిపించబోతుంది. అందులో ఒకటి ప్రతినాయిక ఛాయలున్న పాత్రని సమాచారం. ఈ పాత్ర కోసం ఐశ్వర్య ప్రత్యేకంగా సాధన చేస్తుందట. కొవిడ్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో తిరిగి మళ్లీ మొదలైంది. ఎక్కువమంది తారాగణంపై ఇందులోని ఓ గీతాన్ని కూడా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో చిత్రబృందం ఉందట. తొలిభాగం చిత్రీకరణ మే నెలకి పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, విక్రమ్‌ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాజేష్‌, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ ఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు.