Editorials

2012 కేసులో నేడు తీర్పు

2012 కేసులో నేడు తీర్పు

దంపతుల హత్య కేసులో 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా గురజాల కోర్టు తీర్పు వెలువరించింది.

2012లో దాచేపల్లి మండలం బూదవాడకు చెందిన దంపతులు మస్తాన్, లక్షమ్మ మోపెడ్​పై వెళ్తుండగా ప్రత్యర్థులు నరికి చంపారు.

ఈ కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు విచారణ సమయంలో ఒకరు మరణించగా మిగిలిన 14 మందికి న్యాయస్థానం శిక్ష విధించింది.

ఒక్కొక్కరికి 1500 రూపాయల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.