చిరంజీవి నటించిన ‘స్టాలిన్’లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు నటి త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోలేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’లో మొదట త్రిషనే కథానాయికగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. కాగా, ‘లూసిఫర్’ రీమేక్లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నయన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష కూడా ‘లూసిఫర్’ రీమేక్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
చిరంజీవి కోసం సై అంటున్న త్రిష
Related tags :