NRI-NRT

అమెరికాలో భారతీయులపై బైడెన్ ప్రశంసలు

Joe Biden Praises American Indians During Call With NASA

అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి..తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోంది. వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు(స్వాతిమోహన్‌), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, నా ప్రసంగ ప్రతి రాసిన వినయ్ రెడ్డి అంతా భారతీయ అమెరికన్లే’ అని బైడెన్ అన్నారు. నాసా మార్స్ మిషన్ 2020(గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్‌)కు నాయకత్వం వహిస్తోన్న స్వాతి మోహన్ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు