NRI-NRT

రేపు జూమ్‌లో ఎన్నారై తెరాస శ్రేణులతో కవిత సమావేశం

MLC Kavitha To Speak With NRI TRS Cadre via Zoom

రేపు 50 దేశాల టీఆర్ఎస్ ఎన్నారై ప్ర‌తినిధుల‌తో జూమ్‌యాప్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం : మహేష్ బిగాల

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను (భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5:00 గంటలకు 6th మార్చ్ నాడు ) టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినటర్ మహేష్ బిగాల నిర్వహించనున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ,ఎన్నారై సలహాదారు కల్వకుంట్ల కవిత గారు హాజరుకానున్నారు ,ప్రస్తుత కరోనా వల్ల ఆయా దేశాలలో పరిస్థితి , మున్ముందు రాబోయే రోజులలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మెంబర్షిప్ డ్రైవ్ ఫై సూచనలు చేయనున్నారు అని మహేష్ బిగాల తెలిపారు, ఈ కార్యక్రములో ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గారు , హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి గారు పాల్గొననున్నారు .
MLC Kavitha To Speak With NRI TRS Cadre via Zoom