NRI-NRT

కువైట్ భారత రాయబార కార్యాలయ వేళల్లో మార్పు

కువైట్ భారత రాయబార కార్యాలయ వేళల్లో మార్పు

కువైట్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పక్కాగా అమలుచేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు అక్కడ వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న భారత రాయబార కార్యాలయం పని వేళల్లో మార్పులు చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉండనుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని కార్యాలయ అధికారులు ప్రకటించారు.