ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) లాస్ ఏంజెల్స్ విభాగం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన చెస్ టోర్నమెంట్కు మంచి స్పందన లభించింది. విద్యార్థులలో సృజనాత్మకతను, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్ధులు దాదాపు 250 మందికిపైగా పాల్గొన్నారు.ఆన్లైన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. చెస్ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో నాట్స్ లాస్ ఏంజెల్స్ సమన్వయకర్త చిలుకూరి శ్రీనివాస్, సంయుక్త సమన్వయకర్త మనోహర్ మద్దినేని, స్పోర్ట్స్ చైర్ దిలీప్ సూరపనేని, స్పోర్ట్స్ టీం సభ్యులు కిరణ్ ఇమిడిశెట్టి, తిరుమలేశ్ కొర్రంపల్లి, రామకృష్ణ జిల్లెలమూడి, చెస్ మాస్టర్ రితీష్ మాథ్యూ, నాట్స్ వాలంటీర్స్ శంకర్ సింగంశెట్టి, కరుణానిధి ఉప్పరపల్లి, మురళి ముద్దనా, గౌతమ్ పెండ్యాల, బిందు కామిశెట్టి తదితరులు కీలకంగా వ్యవహరించారు.
నాట్స్ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు
Related tags :