Business

నేడు కర్నూలు విమానాశ్రయం ప్రారంభం

నేడు కర్నూలు విమానాశ్రయం ప్రారంభం

కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరిస్తారు. టెర్మినల్‌ భవనం వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు. 12.35 గంటలకు విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.