NRI-NRT

అక్రమ వలసదారుడిని స్వదేశం తరలించిన తెరాస మలేషియా

NRI TRS Malaysia Helps Telangana Illegal Immigrant To Reach Home

మలేషియాలో పట్టుబడ్డ అక్రమ వలసదారుడికి స్వగ్రామం చేరడానికి చేయూతనిచ్చిన తెరాస మలేషియా. కడెం మండలం బూత్కూరు గ్రామానికి చెందిన రేగుంట నర్సయ్య మలేషియాలో విసా గడువు ముగిసి పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించి విడుదలకు సిద్ధంగా ఉన్నాడు.శిక్షణాంతరం స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి అనుమతి పత్రాలతో పాటు ప్రయాణ ఖర్చులకు తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించి స్వగ్రామానికి చేరడానికి చేయూతనందించారు.