DailyDose

విశాఖలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్-నేరవార్తలు

విశాఖలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్-నేరవార్తలు

* పురుగుల మందు తాగి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చికిత్సలు పొందుతూ బుధవారం ఉదయం మదనపల్లి జిల్లా అస్పత్రిలో మృతి చెందారు..

* ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన మైనర్ బాలిక వెల్లంకి రాజశ్రీని ఆచూకీ లభ్యం.

* విశాఖలో నిత్య పెళ్ళికొడుకు అరుణ్ కుమార్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది మందితో ప్రేమ పెళ్ళి అపై వ్యభిచారం చేయ్యాలంటు ఓత్తిడి చేస్తుండడం తో మహిళా సంఘాలను ఆశ్రయించడంతో మహిళా చేతనా సంస్థ అధ్యక్షురాలు కత్తి పద్మ బాధితులకు బాసటగా నిలిచింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో కత్తి పద్మ మాట్లాడుతూ అరుణకు గంజాయి, వ్యభిచార ముఠా తో లింకులు ఉన్నాయని ఆరోపించారు. మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠా కు అమ్ముతానంటు వేధింపులు చేస్తున్నాడని చెప్పారు. మాట వినకపోతే తుపాకీ కత్తులతో భేదిరింపులు చేసేవాడని చెప్పారు. బాధితులు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదన్నారు.ప్రాణ భయంతో బాధిత మహిళలు తమను ఆశ్రయించారని తెలిపారు.

* విధి నిర్వ‌హ‌ణ‌లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, హోంగార్డు క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ వారిని ఢీకొట్టాడు.దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మ‌హిపాల్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఏఎస్ఐ నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.