అమెరికాలో జడ్జిగా తెలుగు తేజం
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు తేజం వెలిసింది.
వాషింగ్టన్ డిసిలో జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ రూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు.
మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపాకు అవకాశమిచ్చారు.
ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా ఉన్నారు.
రూపా వాళ్ల తల్లిదండ్రులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల.
వీరు చాలా ఏండ్ల కిందట యుఎస్ లో స్థిరాపడ్డారు.