తాప్సీ సినీ ప్రయాణంలో దూకుడు కనిపిస్తోంది. కొత్తదనం నిండిన కథలకు.. సవాల్ విసిరే పాత్రలకు చిరునామాగా నిలుస్తూ బాక్సాఫీస్ ముందు సత్తా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడామె ‘శభాష్ మిథు’ కోసం క్రికెటర్గా మారింది. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవిత కథతో రూపొందుతోన్న చిత్రమిది. రాహుల్ ధోలాఖియా దర్శకుడు. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. తాజాగా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. దీనికి సంబంధించిన తాప్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘లెట్స్ గో డే – 1’ అంటూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ చిత్రం కోసం ఆమె కొన్ని నెలలుగా క్రికెట్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఇందుకోసం నూషిన్ అల్ ఖాదీర్ అనే కోచ్ను నియమించుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘రష్మీ రాకెట్’, ‘లూప్ లపేటా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మిథాలీ సినిమా ప్రారంభం
Related tags :