NRI-NRT

ఫిన్‌లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా నెల్లూరు ప్రవాసుడు రఘునాధ్

ఫిన్‌లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా నెల్లూరు ప్రవాసుడు రఘునాధ్

ఫిన్లాండ్‌ తెలుగు సంఘం అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం నల్లరాజుపాళెంకు చెందిన పార్లపల్లి రఘునాథ్‌ ఎన్నికయ్యారు. ప్రజల జీవన ప్రమాణాల పరంగా ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే ఈ దేశంలో 2000 మంది వరకు తెలుగు ప్రజలు ఉన్నారు. ఫిన్లాండ్‌లో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించేందుకు 2008లో ఈ సంఘం ఏర్పడింది. 2021 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఉగాది సందర్భంగా ఎన్నుకున్నారు.