Sports

హర్మన్‌ప్రీత్‌కు నెగిటివ్

హర్మన్‌ప్రీత్‌కు నెగిటివ్

టీమ్‌ఇండియా మహిళా జట్టు టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆమే స్వయంగా వెల్లడించారు. మార్చి 30న తనకు కరోనా సోకిందని ఆమె సామాజిక మాధ్యమాల్లో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టులో తనకు నెగిటివ్‌గా తేలిందన్నారు.