తానా 2021 ఎన్నికల ప్రచారం ముగింపు దశకు జేరుతున్న తరుణంలో అభ్యర్థులు కీలక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ బుధవారం నుండి శనివారం వరకు ప్రవాస తెలుగువారికి ప్రసిద్ధి చెందిన డల్లాస్లో నాలుగు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. నాలుగు రోజుల్లో పలు సమావేశాలు నిర్వహించి స్థానిక ప్రవాసుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు గట్టిగా చేశారు. డల్లాస్ శిబిరం నుండి జయశేఖర్, నిరంజన్, తాళ్లూరి మురళీ, తూనుగుంట్ల శిరీష తదితరులు తానా సభ్యులతో ముచ్చటించారు. శుక్రవారం అట్లాంటాలో జరిగిన కార్యక్రమానికి భారీగా ప్రవాసులు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్యానెల్ తరఫున జనార్ధన్ నిమ్మలపుడి, శశాంక్ యార్లగడ్డలు పాల్గొన్నారు. ఆదివారం నాడు చికాగోలో ప్రవాసులతో ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు నిరంజన్ తెలిపారు.
డల్లాస్-అట్లాంటా-చికాగోల్లో విస్తృతంగా పర్యటించిన నిరంజన్ ప్యానెల్
Related tags :