Movies

పుష్పకి రంగమ్మత్త ఏమవుతుంది?

Rangamma Atha Anasuya In Pushpa

‘రంగస్థలం’ సినిమా కోసం అనసూయని రంగమ్మత్తగా మార్చేశారు దర్శకుడు సుకుమార్‌. ఆ పాత్ర ఆమెకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి అనసూయ కోసం సుకుమార్‌ ఓ కీలక పాత్రని సృష్టించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ‘పుష్ప’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ ఓ కీలక పాత్రని పోషిస్తోంది. బుధవారం ఆమెపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ మేరకు ఆమె ఓ క్లాప్‌ పట్టుకొన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కనిపించిన అనసూయ…. ఈసారి ఎలాంటి పాత్రతో సందడి చేస్తుందనేది చూడాలి.