NRI-NRT

భారత్‌పై నేపాల్-ఐర్లాండ్ ఆంక్షలు

భారత్‌పై నేపాల్-ఐర్లాండ్ ఆంక్షలు

భారత్​పై నేపాల్, ఐర్లాండ్ ఆంక్షలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతున్న క్రమంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

– భారత్​తో సంబంధం ఉన్న 22 సరిహద్దు పాయింట్లను మూసివేయాలని నిర్ణయించింది.

– మరోవైపు.. ఐర్లాండ్​ సైతం భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్​లో ఉండాలని ఆంక్షలు విధించింది.

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ నేపాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌తో సంబంధం ఉన్న 22 సరిహద్దు మార్గాలను మూసేయాలని నిర్ణయించింది.

నేపాల్-భారత్‌ మధ్య మొత్తం 35 సరిహద్దు పాయింట్లు ఉండగా అందులో 22 పాయింట్లను మూసేయాలని.. నేపాల్‌ కొవిడ్‌ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ మంత్రి మండలికి సిఫారసు చేసింది.

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్‌ వెల్లడించింది.

ఐర్లాండ్​లో క్వారంటైన్

భారత్​లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్​ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా హోటళ్లలో క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించింది.

భారత్​తో పాటు జార్జియా, ఇరాన్, మంగోలియా, కోస్టారికా దేశాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

క్వారంటైన్ ​కోసం ముందుగానే బుక్​ చేసుకోవాలని సూచించింది.