Politics

ఈటలను బర్త్‌రఫ్ చేసిన కేసీఆర్

ఈటలను బర్త్‌రఫ్ చేసిన కేసీఆర్

రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. సీఎం కేసీఆర్‌ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈటలను బర్తరఫ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట పరిధిలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బృందాలుగా ఏర్పడి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు విచారణ చేశారు. తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈటలకు చెందిన హ్యాచరీస్‌ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే నిర్వహించారు. తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, మాసాయిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్‌ తెలిపారు. నిన్న దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను సీఎస్‌కు అందించారు.