Politics

తృణమూల్ గెలిచింది. మమతా ఓడింది.

పశ్చిమ బెంగాల్‌లో ఆదినుంచి ఉత్కంఠరేపిన నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1736 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించారు. ఈ సందర్భంగా నందిగ్రామ్‌లో ఫలితమేదైనా అంగీకరిస్తానని మమతా బెనర్జీ పేర్కొన్నారు.