Movies

దాసరికి గుర్తింపు రాలేదని చిరంజీవి ఆవేదన

దాసరికి గుర్తింపు రాలేదని చిరంజీవి ఆవేదన

‘దాసరి నారాయణరావుకి ప్రభుత్వ నుంచి సముచిత గుర్తింపు ఇప్పటికీ రాలేదు’ అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. మంగళవారం (మే 4) దాసరి జయంతి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా దాసరి సేవల్ని కొనియాడారు. ‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి నా స్మృత్యాంజలి. ఒకదానికి మించి మరొక చిత్రాన్ని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా మలిచారు. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే! దాసరికి ప్రభుత్వ గుర్తింపు ఇప్పటికీ రాకపోవడం తీరని లోటు. ఇప్పటికైనా దాసరికి పద్మ పురస్కారం అందితే అది తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది’ అని పేర్కొన్నారు.