ఏదైనా అనుభవమయితే గానీ తత్వం బోధపడదు అంటారు పెద్దలు. ఇప్పుడు హీరోయిన్ కృతీ కర్బందా కూడా కరోనా గురించి అదే మాట అంటున్నారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్లో కృతీ కుటుంబ సభ్యులు కరోనా బారినపడినట్టు పేర్కొన్నారు. అందులో ‘కరోనా వల్ల మేము పడిన ఇబ్బందులు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. గడచిన రెండు రోజులుగా నేనూ నా కుటుంబం ఆ బాధను అనుభవిస్తున్నాం. స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ బాధ అర్థం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెట్టటం అంటే ప్రాణాలను రిస్క్లో పెట్టటమే. కరోనా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవటం కంటే దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. అందుకే ఇంటిపట్టునే ఉండండి. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు’’ అని ట్వీట్ చేశారామె. తెలుగులో ‘తీన్మార్’, ఒంగోలు గిత్త’, ‘బ్రూస్ లీ’ చిత్రాల్లో కృతీ నటించారు. ప్రస్తుతం తమిళంలో ‘వాన్’, హిందీలో ‘14 ఫెరే’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.
రిస్క్లో పెట్టడమే
Related tags :