Devotional

నేటి నుండి కేదార్‌నాథ్ ఆలయం ప్రారంభం

నేటి నుండి కేదార్‌నాథ్ ఆలయం ప్రారంభం

నేడు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం
పూర్తయిన ఆలయ అలంకరణ
కరోనా కారణంగా భక్తులకు నో ఎంట్రీ
వరుసగా రెండో ఏడాది చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత
వరుసగా తెరుచుకోనున్న యుమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలు
న్యూ ఢిల్లీ : చార్‌ధామ్ దేవాలయాల్లో ఒకటైన హిమాలయాల్లోని కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. సోమవారం ఆలయంలో పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. అయితే, కరోనా నేపథ్యంలో భక్తులకు మాత్రం అనుమతి లేదు. కేవలం ఆన్‌లైన్‌ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రతి ఏడాది శీతాకాలంలో 6 నెలల పాటు మూసి ఉండే చార్‌ధామ్‌ ఆలయాలు వేసవిలో తెరుచుకుంటాయి. కానీ, కరోనా కారణంగా గత ఏడాదితో పాటు ఈసారి కూడా చార్‌ధామ్‌ యాత్రను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. చార్‌ధామ్‌ ఆలయాల్లో ముందుగా యుమునోత్రిని తెరుస్తారు. శుక్రవారం ఈ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శనివారం గంగోత్రి, సోమవారం కేదార్‌నాథ్‌, మంగళవారం బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోనున్నాయి.