ఉజ్మా అహ్మద్ బయోపిక్లో టైటిల్ రోల్కు శ్రద్ధా కపూర్ బదులు నుష్రత్ బరుచాను ఎంపిక చేసినట్టు హిందీ చిత్రసీమ గుసగుస. నాలుగేళ్ల క్రితం… 2017లో ఆమె ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మలేషియాలో ఓ పాకిస్తానీ ట్యాక్సీ డ్రైవర్ను ప్రేమించిన ఉజ్మా అహ్మద్కు, పాకిస్తాన్ వెళ్లిన తర్వాత… అప్పటికే అతడికి వివాహమైందనీ, నలుగురు పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహకారంతో ఎలాగోలా తప్పించుకుని పాకిస్తాన్ నుంచి దేశానికి తిరిగొస్తారు.రెండేళ్ల క్రితమే ఉజ్మా అహ్మద్ బయోపిక్ తీయాలని దర్శకుడు శివమ్ నాయర్ సంకల్పించారు. శ్రద్ధా కపూర్ను ప్రధాన పాత్రకు అనుకున్నారు. ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో నుష్రత్ బరుచాను ఎంపిక చేశారట. కొవిడ్-19 కారణంగా అగ్రిమెంట్లు జరగలేదట. ముంబైలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసి, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఉజ్మా అహ్మద్ను ఇండియాకు తీసుకొచ్చిన అధికారి జేపీ సింగ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారట.
శ్రద్ధా బదులు నుశ్రత్
Related tags :