WorldWonders

తమిళనాడులో కరోనాదేవి ఆలయం

తమిళనాడులో కరోనాదేవి ఆలయం

సెకండ్‌ వేవ్‌ రూపంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రోజూ లక్షల మందికి వ్యాపిస్తూ.. వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకొంటున్న ఈ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో కరోనా దేవి ఆలయం నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని వేడుకుంటూ 48 రోజుల పాటు రోజూ పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కోయంబత్తూరు శివారులోని ఇరుగుర్‌లో కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. 1.5 అడుగుల నల్లరాతి విగ్రహాన్ని మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. దానికి కరోనా దేవిగా నామకరణం చేశారు. ప్రజల్ని రక్షించేలా చూడాలని ప్రార్థిస్తూ 48 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నట్టు మఠం వర్గాలు వెల్లడించాయి.