WorldWonders

ఇండియాలో 24.1శాతం మందికి కరోనా

ఇండియాలో 24.1శాతం మందికి కరోనా

దేశంలో 24.1శాతం మంది ప్రజలు కరోనా బారినపడినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తాజాగా జరిపిన సెరో సర్వేలో వెల్లడైంది. ఒక్క కరోనా వైరస్ కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్‌ సోకినట్లే అని పేర్కొంది. దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని ఐసీఎంఆర్‌ సర్వే స్పష్టం చేసింది. ఈ లెక్కలకు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలకు అసలే మాత్రం పొంతన లేకపోవడం గమనార్హం. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) మూడోసారి నిర్వహించిన సెరో సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 24.1శాతం మంది ఇప్పటికే కరోనా వైరస్‌ బారినపడినట్లు ఈ సర్వే తేల్చింది. అయితే, కేంద్రం ప్రకటించిన గణాంకాలకు ఐసీఎంఆర్‌ లెక్కలకు పొంతన లేదు. దేశంలో కేవలం రెండు శాతం మందికే కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. 2020 డిసెంబర్‌ – 2021 జనవరి మధ్య కాలంలో ఐసీఎంఆర్‌ ఈ సెరో సర్వే జరిపింది. దీని ప్రకారం, ఒక్క కరోనా కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్‌ సోకినట్లే అని తెలుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు సహా దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు వైరస్‌ కారణంగా ప్రభావితమైనట్లేనని సెరో సర్వే స్పష్టం చేసింది. ఆరోగ్య సిబ్బందిలో 25.6శాతం మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు స్పష్టం చేసింది..