Politics

ఎమ్మెల్యే తహశీల్దార్లపై క్రిమినల్ కేసు నమోదు

ఎమ్మెల్యే తహశీల్దార్లపై క్రిమినల్ కేసు నమోదు

ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు భూవివాదంలో చిక్కుకున్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతంకుమార్‌పై కేసు నమోదు చేశారు. 120బీ,166ఏ, 167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాప్రాలో సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూవివాదంలో సుభాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భూవివాదంలో సుభాష్‌రెడ్డిపై తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. సుభాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేశారని మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు