* ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. ఛార్టెడ్ ఫ్లైట్లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న ఫ్లైట్ సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
* సంగం డెయిరీ కేసులో గత నెలలో అరెస్టయిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
* టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు పాలకొల్లులో హౌస్ అరెస్ట్ చేశారు.
* ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగరం వద్ద రెండు లారీల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
* విజయవాడలో 4 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు
* పరవాడ మండలం భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో లీకైన గ్యాస్.