Kids

17వేలకు పైగా చిన్నారులకు కరోనా

17వేలకు పైగా చిన్నారులకు కరోనా

కొవిడ్‌ మూడో దశ విజృంభణలో చిన్నారులకు ఎక్కువ ముప్పు పొంచి ఉందంటూ నిపుణుల హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో పెద్దఎత్తున చిన్నారులు కరోనా బారినపడినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ జిల్లాలో 18 ఏళ్ల లోపు చిన్నారుల్లో 17,688 మందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్​లో 7,760 మంది, మే నెలలో 9,928 మందికి వైరస్​ సోకినట్లు జిల్లా సర్జన్ డాక్టర్‌ సునీల్​ పోఖ్​రాణా వెల్లడించారు. మొత్తం పాజిటివ్​ కేసుల్లో 18 ఏళ్ల లోపు వారే 8 నుంచి 10 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. ఈ గణాంకాలను జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే సైతం ధ్రువీకరించారు. కరోనా మూడో దశలో పిల్లలే అధికంగా ప్రభావితమవుతారని నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో ఈ లెక్కలు ముందు జాగ్రత్తల అవసరాన్ని తెలియజేస్తున్నాయి.