WorldWonders

హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని మోడీకి ఆరేళ్ల బాలిక ఫిర్యాదు

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నప్పటికీ, తనకు చాలా హోంవర్క్‌ ఇస్తున్నారని ఓ ఆరేండ్ల బాలిక ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూమ్‌ వేదికగా తనకు క్లాసులు నడుస్తున్నాయని, 6, 7, 8 తరగతుల విద్యార్ధులకు ఇచ్చేంత హోంవర్క్‌ను టీచర్లు తనకు ఇస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. దీనిపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా స్పందించారు. చిన్నారి ఫిర్యాదు సమంజసమైనదేనన్నారు. స్కూల్‌ పిల్లలపై హోంవర్క్‌ భారం తగ్గించే పాలసీని 48 గంటల్లో తీసుకురావాలని జమ్ముకశ్మీర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు.