DailyDose

మైలవరం మహిళపై యాసిడ్ దాడి-నేరవార్తలు

Crime News - Acid Attack On Mylavaram Lady

* కృష్ణాజిల్లా మైలవరం…మండలంలోని గణపవరం గ్రామంలో మహిళ పై బాత్రూం లు శుబ్రపరిచే యాసిడ్ తో దాడి.కట్టా వెంకాయమ్మ(38) పై పటాపంచుల గోపి(35) యాసిడ్ తో దాడి చేయడంతో మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు.శరీరమంతా మంటలు రావడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.మహిళకు భర్త లేరు.గోపీతో వివాహేతర సంబందం కొనసాగిస్తుంది.ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో తనతో మాట్లాడడం లేదని వెంకాయమ్మ పై యాసిడ్ తో దాడి చేసిన గోపి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* బ్రాడీపేటకు చెందిన ఇక్కుర్తి వెంకట్ రీడింగ్ రూమ్ నిర్వహణ…పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రం ఏర్పాటు…గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ఫోటో తీసి వాట్సఫ్ గ్రూపులో పోస్టు చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు.ఈ నేపథ్యంలో వెంకట్ గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు.పొలిటికల్ మోజి అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా..దీనిపై వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య…పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు.పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

* తెనాలిలో రౌడీ షీటర్ దారుణ హత్య.అమరావతి కాలనీకి చెందిన చప్పిడి తరుణ్ ను దారుణంగా కత్తులతో నరికి చంపిన దుండగులు.పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.

* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారి 65పై ఆటో నగర్ వద్ద చిల్లకల్లు నుండి కోదాడ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న బైకిస్ట్ కి ఢీ. పల్టీ కొట్టిన లారీ. బైకిస్ట్ కు తీవ్ర గాయాలు జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాల కు తరలింపు. ఒక అవు,ఒక గేదె ను తీసుకు వెళ్తున్న లారీ.