Movies

అఖండంగా కొనసాగుతున్న చిత్రీకరణ

అఖండంగా కొనసాగుతున్న చిత్రీకరణ

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటంతో మిగిలిన షూట్‌ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులై తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ఈ ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించనున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఓ పాటతో పాటు కొన్ని కీలక యాక్షన్‌ సన్నివేశాలు తెర కెక్కించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ చిత్రంలో రెండు శక్తిమంతమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వరదరాజులు అనే ప్రతినాయకుడిగా శ్రీకాంత్‌ కనిపిస్తారు. ఇందులో ఆయన గెటప్‌.. పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉండనున్నాయని సమాచారం. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రామ్‌ ప్రసాద్‌.