NRI-NRT

యూరప్‌లో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు

యూరప్‌లో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సావాలు

లాత్వియా (యూరప్‌)లో పీవీ శతజయంతి ఉత్సావాలు ఘనంగా నిర్వహించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో… ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, పీవీ తనయుడు పీవీ ప్రభాకర్‌రావు అన్నారు. పీవీపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ అని శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. పీవీ ఖ్యాతిని స్మరించుకోవడం, నేటి తరానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నిథుం డైరెక్టర్ డాక్టర్‌ చిన్నం రెడ్డి పాల్గొన్నారు. జూమ్‌ ద్వారా జరిగిన మీటింగ్‌లో తెలుగు ప్రతినిధులు విజ్ఞాన్‌, క్రాంతి కుమార్‌, భాను, అపూర్వ, సుస్మిత, రణధీర్‌, స్వాతి, వినయ్‌ బొంతల పాల్గొన్నారు.
యూరప్‌లో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలు