ScienceAndTech

అగ్ని ప్రైమ్…1000కిలోల అణ్వాయుధాలను తీసుకుని వెళ్తుంది

అగ్ని ప్రైమ్…1000కిలోల అణ్వాయుధాలను తీసుకుని వెళ్తుంది

అగ్ని సిరీస్‌లో అత్యాధునిక క్షిపణి అయిన అగ్ని ప్రైమ్‌ను భారత్‌ డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని బాలాసోర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి సోమవారం ఉదయం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది 1000-2000 కిలోమీటర్ల గల లక్ష్యాలను ఛేదించగలదు. వెయ్యి కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. అగ్ని-1 క్షిపణి కంటే ఇది తేలికపాటి మిస్సైల్‌ అని డీఆర్‌డీవో పేర్కొంది.