Politics

కేటీఆర్ కుమారుడికి యుకె పురస్కారం

కేటీఆర్ కుమారుడికి యుకె పురస్కారం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు.. మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు – 2021 హిమాన్షును వరించింది. గ్రామాల స్వయం సమృద్ధి కోసం హిమాన్షు ఇటీవల ‘షోమా’ పేరుతో ఓ వీడియో రూపొందించారు. కల్తీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంపై, గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో వివరించారు.