Devotional

ఏజెన్సీ ద్వారా తిరుమల లడ్డుల వితరణ

ఏజెన్సీ ద్వారా తిరుమల లడ్డుల వితరణ

తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ఏజెన్సీకి అప్పగించారు. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని సైతం అప్పగించారు. లడ్డూ కేంద్రంలో కేవీఎమ్‌ ఇన్ఫోకామ్‌ సంస్థ సేవలు ప్రారంభించింది. ఇప్పటి వరకు పలు బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిపేవారు. నాణ్యమైన సేవలను అందించేందుకే ప్రైవేటు సంస్థకు అప్పగించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.