WorldWonders

పనసకాయ తగిలి పాలకొల్లు వ్యాపారి మృతి

పనసకాయ తగిలి పాలకొల్లు వ్యాపారి మృతి

పనస కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్‌, వ్యాపారవేత్త మాటూరి నారాయణమూర్తి (66) తన ఇంటి పెరట్లో ఉన్న పనస చెట్టు కాయలు కోయిస్తూ.. అవి కిందపడకుండా గోనె సంచి పట్టుకుంటున్నారు. ఆ సమయంలో చెట్టుపై నుంచి ఓ కాయ నారాయణమూర్తి ముఖంపై పడటంతో అదుపుతప్పి వెనక్కి పడిపోయారు. సిమెంట్‌ రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం తొలుత పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించేందుకు వాహనం ఎక్కిస్తుండగా చనిపోయారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.