దగ్గుబాటి కుటుంబం నుంచి మరో కథానాయకుడు తెరకు పరిచయం అవుతున్నారు. నిర్మాత డి.సురేష్బాబు తనయుడు, రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి కథా నాయకుడిగా ఓ సినిమా పట్టాలెక్కింది. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ కలయికలో సినిమా ఆదివారం హైదరాబాద్లో మొదలైంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అహింస’ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆర్.పి.పట్నాయక్ స్వరాలు సమకూరుస్తున్నారు. తేజ – ఆర్.పి.పట్నాయక్ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలొచ్చాయి. కొంత విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది.
తెలుగు ప్రేక్షకుల పైకి మరొక వారసుడు
Related tags :