Politics

యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

యాదాద్రిలో భారీ వర్షాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నీటమునిగాయి. మండలంలోని వంగపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంగణం వరదనీటితో చెరువును తలపిస్తోంది. ఆలేరు నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బిక్కేరు వాగు ఉధృతితో కొరటికల్‌-మురిపిరాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.