Business

వైదొలగిన శివ నాడార్

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) బాధ్యతల నుంచి సంస్థ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ (76) తప్పుకున్నారు. ఈ నెల 19న సంస్థ పనివేళలు ముగిసినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈనెల 20 నుంచి కంపెనీ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతూ, బోర్డుకు వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతల్ని ఆయన నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఉన్న సి.విజయ్‌కుమార్‌ను కొత్త ఎండీగా నియమించారు. ఈనెల 20 నుంచి ఈయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత ఏడాది జులైలో సంస్థ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి శివ్‌ నాడార్‌ తప్పుకోగా, ఆయన కుమార్తె రోష్ని నాడార్‌ మల్హోత్రా సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.