WorldWonders

ఆక్స్‌ఫోర్డ్‌లో చదివిన ఆఫ్ఘాన్ మంత్రి…ఇప్పుడు పిజ్జాలు అమ్ముతున్నాడు

ఆక్స్‌ఫోర్డ్‌లో చదివిన ఆఫ్ఘాన్ మంత్రి…ఇప్పుడు పిజ్జాలు అమ్ముతున్నాడు

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు దారుణంగా మారాయి.

దీంతో తాలిబన్ల చెరలో బతకలేమని భావించిన ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం విదేశాల బాటపట్టారు.

ఈ నేపథ్యంలో ఆ దేశ ఓ మాజీ మంత్రి సయ్యద్​ అహ్మద్​ షా సాదత్​ చేస్తున్న పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

గతంలో సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పని చేసిన సయ్యద్ ప్రస్తుతం జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫోటోలు వైరల్​ అవుతున్నాయి.

2018లో సమాచార, సాంకేతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్​ రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు.

కొన్ని కారణాల దృష్ట్యా 2020లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జర్మనీకి వెళ్లిపోయినట్లు అరబిక్​ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

జర్మనీలోని లీప్‌జిగ్‌లో సైకిల్​పై పిజ్జా డెలివరీ చేస్తున్నట్లు, గతంలో మంత్రిగా పని చేసిన ఫొటోలను ట్వీట్​ చేశాయి.

సయ్యద్​.. ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్​, ఎలక్ట్రానిక్​ ఇంజినీరింగ్​లో మాస్టర్​ డిగ్రీలు పూర్తి చేసినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది.