DailyDose

ఈడీ విచారణకు ఛార్మీ. ఏపీ విద్యామంత్రిపై అక్రమాస్తుల కేసు-నేరవార్తలు

ఈడీ విచారణకు ఛార్మీ. ఏపీ విద్యామంత్రిపై అక్రమాస్తుల కేసు-నేరవార్తలు

* మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్‍సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు గతంలో ఈ కేసులో స్టే ఉండడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం.సుప్రీంకోర్టులో పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఏపీ ప్రభుత్వం.నెల రోజుల్లో కేసును తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.జస్టిస్ మానవేంద్రనాథ్‍రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ.దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టేసిన హైకోర్టు .ఎఫ్‍ఐఆర్‍ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు .అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు.

* టీడీపీ నాయకురాలు చెన్నుపాటి ఉషారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు భారీగా మోహరించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయంటూ ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమోరండం సమర్పించడానికి వెళితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దిశ సెక్షన్‌ని అమలు చేయాలంటూ కోరుతున్న వినతి పత్రాన్ని ఇచ్చేందుకు దిశ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనుమతించలేదు.

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. పబ్లిక్‌ సర్వెంట్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మంత్రి సురేశ్‌ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ అధికారులు. సురేశ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలితకుమారి.. ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని పేర్కొంటూ.. ఫిబ్రవరి 11న దీనిని తోసిపుచ్చింది. అయితే.. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

* టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మీని ప్రశ్నించనున్నారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్‌ లావాదేవీల వివారాలను వెంట తేవాలని చార్మీకి ఇచ్చిన నోటీసులో ఈడీ పేర్కొంది.

* నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వక పోవడంపై హైకోర్టు సీరియస్.కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం..IAS అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్ కు నెల జైలు 1000 జరిమానా..అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు 1000 జరిమాన..రెండు వారాలు జైలు..SS రావత్ కు నెలరోజుల జైలు1000.ఫైన్..ముత్యాల రాజుకు రెండు వారాల జైలు1000 ఫైన్..శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చిన కోర్టు..నెల రోజులపాటు శిక్షను సస్పెండ్ చేసిన న్యాయస్థానం.