Politics

నేను వై.ఎస్. కల నెరవేరుస్తా-రేవంత్

నేను వై.ఎస్. కల నెరవేరుస్తా-రేవంత్

దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కోరిక మేరకు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం ప్రయత్నిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ 12వ వర్ధంతిని పురస్కరించుకోని గాంధీభవన్‌లో ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, పొన్నాల, షబ్బీర్‌అలీ, వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బండి సంజయ్‌ మోకాలి చిప్పలు అరిగే వరకు పాదయాత్రలు, తీర్థయాత్రలు చేసినా మోదీని ప్రసన్నం చేసుకోలేరని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. ఆయన తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లిపోవడం మంచిదన్నారు. దిల్లీలో కార్యాలయానికి దక్షిణ భారత దేశంలో ఒక్క తెరాసకు మాత్రమే ప్రభుత్వం భూమిని ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం వాళ్ల కుటుంబానికి సంబంధించినదని పేర్కొన్నారు.