NRI-NRT

ఎస్పీబీకి అమెరికా తెలుగు సంఘం(ఆటా) స్వరనీరాజనం

America Telugu Association ATA Tribute To SPB

అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం నాడు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళిగా స్వరనీరాజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. “బాలు గాన సుధా స్మృతి” పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. 1992 సంవత్సరం ఆటా రెండవ మహాసభలు న్యూయార్క్ లో, 2000లో అట్లాంటాలో జరిగిన ఆరవ ఆటా మహాసభలలో, 2014 సంవత్సరం పెన్సిల్వేనియాలో జరిగిన పదమూడవ ఆటా మహాసభలలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీబీ ఆలపించిన గీతాలను రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి, ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యెలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధలు ఈ కార్యక్రమంలో ఆలపించారు, ఈ కార్యక్రమానికి శారద సింగి రెడ్డి, రవి తూపురాణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ అరవింద్ రెడ్డి, సతీష్ రెడ్డి, రామ్ అన్నాడి , అడ్వైసరి కమిటి సంధ్య గవ్వ, పూర్వ కార్యదర్శి అనంత్ రెడ్డి పజ్జూర్, రీజినల్ కోఆర్డినేటర్స్ మహేష్ మానపురి, సుమన సారెడ్డి స్టాండింగ్ కమిటీస్ మంజు రెడ్డి ముప్పిడి, మహేందర్ గనపురం, దామోదర్ ఆకుల, మాధవి లోకిరెడ్డి సంయుక్తంగా శ్రీని ప్రభల, బాల గనపవరపు, బోర్డు అఫ్ ట్రస్టీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, తదుపరి అధ్యక్షురాలు మధు బొమ్మినేనిలు బాలుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎస్పీబీకి అమెరికా తెలుగు సంఘం(ఆటా) స్వరనీరాజనం - America Telugu Association ATA Tribute To SPB