WorldWonders

దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై తుపాకులతో బైకర్ల స్టంట్లు-నేరవార్తలు

దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై బైకర్ల స్టంట్లు-నేరవార్తలు

* మద్దూరుపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దూరుపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కంటైనర్ లారీని దాటుతూ ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్‌ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పో్లీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు పోలీసులు తెలిపారు.

* దుర్గగుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్న యువకులు..ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు..నడిరోడ్డుపై బైక్ పై నిలబడి గన్ తో విన్యాసాలు..KTM , పల్సర్ 220 బైక్ లపై యువకులు హల్ చల్..నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విడియో..రేసులతో వాహనదారులకు ఇబ్బందులు.

* కోవిడ్ నిబందనలు ఉల్లంఘించి విజయవాడలో సంగం డెయిరి పాలకవర్గ సమావేశం నిర్వహించారని పోలీసులు నమోదు చేసిన కేసుపై స్టే విదించిన హైకోర్టు.

* గుంటూరు జిల్లా ఎర్రబాలెం కు చెందిన అంజన్ కృష్ణ, విజయవాడ రేణుకాకు అక్టోబర్ నెలల లో వివాహం.సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్న అంజన్ కృష్ణ.అంజన్ కృష్ణతో రేణుక వివాహం ఘనంగా చేసిన కుటుంబ సభ్యులు.రెండు నెలల సక్రమంగా కాపురం చేసిన భర్త అంజన్ కృష్ణ.అంజన్ కృష్ణ మరో మహిళల తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో మందలించిన భార్య రేణుక.మరో మహిళల తో వివాహేతర సంబంధం బయట పటడంతో తమ కుమార్తె ను అల్లుడు చిత్రహింసలకు గురిచేసేవాడని అరోపిస్తున్న కుటుంబ సభ్యులు.భార్య పై కోపంతో ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడని అవేధన వ్యక్తం చేస్తున్న మృతిరాలి రేణుక కుటుంబ సభ్యులు.భార్యను అనేక మార్లు చనిపోవాలని తిట్టే వాడని… చివరకు చనిపోయేట్లు చేశాడని అల్లుడు పై అగ్రహం వ్యక్తం చేస్తున్న రేణుక కుటుంబ సభ్యులు.తమ బిడ్డ మరణానికి కారణమైన భర్త అంజన్ కృష్ణ ను కఠినంగా శిక్షించాని కన్నీరు మున్నీరుగా పిలపిస్తున్న కుటుంబ సభ్యులు.భర్త అంజన్ కృష్ణ పరార్.

* గుంటూరు జిల్లా పరిధిలోని 13 మంది గ్రామ రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ గారు బియాండ్ యెస్ఎల్ ఏలో పెండింగ్ ఉన్న కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది.