Videos

నటిగా మారిన “సత్యం” రామలింగరాజు కోడలు

నటిగా మారిన “సత్యం” రామలింగరాజు కోడలు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. పోనీ పోనీ… అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘విలక్షణమైన కథకి భావోద్వేగాల్ని మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. సంధ్యారాజు చాలా బాగా డ్యాన్స్‌ చేశారు. చూస్తున్నప్పుడు ‘స్వర్ణకమలం’ గుర్తుకొచ్చింది. నృత్యం ప్రధానంగా సాగే సినిమా రాక చాలా కాలమైంది. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాకు తల్లిగా భానుప్రియ నటించారు. సినిమాలో కీలకమైన పాటని వెంకటేష్‌ విడుదల చేశారు. ‘నాట్యం’లో భాగం కావడం ఓ దీవెనలా భావిస్తున్నా’’ అన్నారు సంధ్యారాజు.