NRI-NRT

న్యూజెర్సీలో ఎస్పీబీకి “కళావేదిక” ఘననివాళి

న్యూజెర్సీలో ఎస్పీబీకి

ప్రముఖ కూచిపూడి కళాకారిణి స్వాతి అట్లూరి గారు ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా సంస్థ కళావేదిక ఆధ్వర్యంలో ఎస్పీబీకి నివాళిగా “బాలు స్వరాంజలి” కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీశివ-విష్ణు టెంపుల్ ఈవెంట్ హాల్ లో గత ఆదివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు ఉష, సుమంగళి, శ్రీకాంత్ సండుగు పాల్గొన్నారు. సెయింట్ లూయీస్ కు చెందిన వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఫణి డొక్కా అట్లాంటా నుంచి ఈ కార్యక్రమానికి హాజరయి బాలుతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపేంద్ర చివుకుల (కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్), స్టెరిలీ.ఎస్.స్టాన్లీ (అసెంబ్లీ మేన్), శాంతి నర్రా (మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్), శాం జోషి (ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్) తదితరులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ, తమ సంస్థ ఉద్దేశాన్ని ప్రేక్షకులకు వివరించారు. సభికులు సంస్థకు విరివిగా విరాళాలు అందజేశారు.
న్యూజెర్సీలో ఎస్పీబీకి
న్యూజెర్సీలో ఎస్పీబీకి
న్యూజెర్సీలో ఎస్పీబీకి
న్యూజెర్సీలో ఎస్పీబీకి