ఇటీవలి కాలంలో ప్రముఖ హీరోయిన్లు అందరూ ఓటీటీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమంత, కియారా అడ్వాణీ, తమన్నా, కాజల్, ప్రియమణి, సాయి పల్లవి తదితరులు ఇప్పటికే ఈ బాటలో నడిచారు. తాజాగా ఆ జాబితాలో నటి త్రిష కూడా చేరనున్నారు. టాలీవుడ్లో ప్రముఖ హీరోలందరితోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది భామ త్రిష.. తొలిసారి తెలుగు వెబ్సిరీస్లో నటించనుంది. ఇదే విషయాన్ని శనివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. సోనీలివ్ ఓటీటీలో ప్రసారం రాబోయే ఈ సిరీస్కి ‘బృందా’ అనే టైటిల్ని ఖరారు చేశారు. క్రైమ్- ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. దర్శకుడు సురేష్ వంగలా దీనికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్సిరీస్ రూపొందుతోంది. ప్రొడక్షన్ డిజైనర్గా పేరు తెచ్చుకున్న అవినాష్ కొల్లా ఈ సిరీస్తో నిర్మాత అవతారమెత్తనున్నారు. సూర్యవంగలా కథ అందించగా.. శక్తికాంత్ కార్తిక్ స్వరాలు సమకూర్చనున్నారు. నటులు సాయికుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్రా విజయ్, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషించనున్నారు.
వెబ్ సిరీస్లోకి త్రిష
Related tags :