NRI-NRT

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ బహుకరణ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ బహుకరణ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను గురువారం నాడు ప్రముఖ గాయని సునీత, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవిలు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్ లైన్ లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతికవిద్యను బోధించడానికి కృషి చేస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి, ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్, పొదుపులక్ష్మీ ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.