Agriculture

రైతునేస్తం పురస్కారాలు అందజేసిన ఉప-రాష్ట్రపతి

రైతునేస్తం పురస్కారాలు అందజేసిన ఉప-రాష్ట్రపతి

ముప్పవరపు, రైతు నేస్తం ఫౌండేషన్ అద్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నిర్వహించిన రైతు నేస్తం పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు.

జ్యోతి ప్రజ్వలన చేసి రైతు నేస్తం పురస్కార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప రాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు.

అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ ఐ. వి.సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచికతో పాటు పలు పుస్తకాలను ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జె. నివాస్,జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ,ముప్ప వరపు ఫౌండేషన్ ఛైర్మన్ హర్షవర్ధన్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా.యడ్లపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు.